హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : రేవంత్రెడ్డి సీఎం కుర్చీ ఎకిన నాటి నుంచి ఇప్పటివరకు తెచ్చిన అప్పులు రూ.80,500 కోట్లు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నాడు అప్పు-తప్పు అన్నోళ్లను ఇప్పుడు దేనితో కొట్టాలి? అని నిలదీశారు. ఎన్నికల హామీలేవీ తీర్చలేదు.. ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు? మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు? 80వేల కోట్ల ధనం ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు? అని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా? కమీషన్ల కోసం కకుర్తి పడే అ ప్పులు తెస్తున్నారా? అప్పు.. శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి అవే అప్పు ల కోసం ముఖ్యమంత్రి పాకులాడటమేంటి? అని ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు తీసుకొని ప్రాజెక్టులు కట్టామని, ప్రతిపైసాతో మౌలిక సదుపాయాలు పెంచామని, దశాబ్దాల ప్రజల కష్టాలు తీర్చామని వెల్లడించారు. కానీ, ముఖ్యమంత్రి తెస్తున్న అప్పుల ‘అడ్రస్’ ఎక డ? అని నిలదీశారు. రాష్ట్ర సంపదను సృష్టించడానికి కాకుండా సొంత ఆస్తులు పెంచుకోవడానికి అప్పులు చేయడం క్షమించరాని నేరమని, రాష్ట్ర భవిష్యత్తు కు ప్రమాదమని కేటీఆర్ హెచ్చరించారు.