సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, ఇతర వర్గాలకు రైల్వే రాయితీలను ఎత్తివేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు ‘వృద్ధుల సంరక్షణ కేవలం బాధ్యత మాత్రమే కాదు.. అది మన కర్తవ్యం. రైలు చార్జీల్లో సీనియర్ సిటిజన్లకు రాయితీని తొలగించాలని కేంద్రం నిర్ణయించిందని తెలిసి బాధపడ్డా.
ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి, విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా’ అంటూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాయితీల కారణంగా రైల్వేశాఖ రూ.కోట్లలో ఆదాయం కోల్పోతున్నదని ఇటీవల పార్లమెంటులో అశ్వినీవైష్ణవ్ సమాధానం చెప్పిన నేపథ్యంలో కేటీఆర్ ఈ మేరకు స్పందించారు.