హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్, బీజేపీ నేత రాజాసింగ్ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల కేటీఆర్ను ఉద్దేశించి రాజాసింగ్ ఒక వీడియో షేర్ చేశారు. తన బులెట్ బండిపై గోషామహల్, పాత బస్తీ చుట్టి వద్దామని రాజాసింగ్ అన్నారు.
ఇలా చేస్తే అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో నేరుగా కేటీఆర్ తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. దీనిపై ట్విట్టర్ వేదికగానే కేటీఆర్ బదులిచ్చారు. ఒకసారి ఏదైనా పెట్రోల్ బంకు వద్దకెళ్లి పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై ప్రజలు ఏమనుకుంటున్నారో వినాలని రాజాసింగ్కు సలహా ఇచ్చారు.
అలాగే ఇళ్ల వద్దకు వెళ్లి గ్యాస్ సిలిండర్ల ధర పెరగడంపై ఏమంటున్నారో కనుక్కోవాలని చెప్పారు. ‘‘జీడీపీ వృద్ధి అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెరుగదల అని వినే ఉంటారు కదా?’’ అంటూ కేటీఆర్ సెటైర్ వేశారు. ఇక ఈ అబద్ధాలు ఆపి పని చేసి ప్రజల మనసులు గెలవాలని సూచించారు.