హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): మూడురోజుల వ్యవధిలోనే రెండోసారి తెలంగాణకు వస్తున్న మోదీ.. ఆ మూడు ప్రధాన హామీలను ఏమి చేశారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. పదేండ్ల నుంచి పాతరేసి ఇంకెంతకాలం ఈ అబద్ధాల జాతరంటూ మంగళవారం ట్వీట్(ఎక్స్) చేశారు. ‘కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు? బయ్యారం ఉకు కర్మాగారం నిర్మించేదెప్పుడు? పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయహోదా దకేదెప్పుడు? మూడురోజుల వ్యవధిలోనే రెండోసారి వస్తున్నారు కదా? ఆ మూడు ప్రధాన హక్కులకు దిక్కే ది?’ అని నిలదీశారు. ‘పదేండ్ల నుంచి పాతరేసి ఇకెంతకాలం ఈ అబద్ధాల జాతర? మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు? గుండెల్లో గుజరాత్ను పెట్టుకుని.. తెలంగాణ గుండెల్లో గునపాలా? కోచ్ ఫ్యాక్టరీ, ఉకు కర్మాగారం ఊపిరి తీశారు. లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్ను ఆగం చేశారు. మా ప్రాజెక్టుకు జాతీయహోదా హామీని తుంగలో తొకారు. దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారు’ అంటూ మండిపడ్డారు.
‘మీ పదేండ్ల పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు 140 కోట్ల భారతీయులనూ మోసం చేశారు. 2022 కల్లా రైతుల ఆదా యం డబుల్ అన్నారు. దేశంలో ప్రతి ఒకరికీ సొంత ఇల్లు అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు. పెట్రోల్ ధరలు నియంత్రిస్తామన్నారు. మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప దేశ ప్రజలకిచ్చిన ఒక మాటైనా నెరవేర్చరా?’ అని నిలదీశారు. ‘మీ పసుపు బోర్డు ప్రకటన కూడా మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉన్నది. ఎన్నికల వేళ హంగామా ఇప్పుడు.. మరి అది అమలు అయ్యేది ఎప్పుడో..’ అం టూ ఎద్దేవా చేశారు. ‘ప్రధానిగా మీ పదేండ్ల పాలనలో అదానీకి తప్ప ఆమ్ ఆద్మీకి దకిందేమిటి? అని నిలదీశారు. ‘మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పకా! మళ్లీ వంద స్థానాల్లో మీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ!!’ అని కేటీఆర్ పేర్కొన్నారు.