హైదరాబాద్: జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లికి పూలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, శాసనమండలిలో విపక్ష నేత మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ కవిత, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యను ఎకడికకడ పార్టీ శ్రేణులు సహా తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించారు.
సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఇతర నాయకులు. pic.twitter.com/gLLiNbW3ET
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2024