హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే లాస్యనందిత భౌతికకాయానికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తోపాటు సీఎం రేవంత్రెడ్డి, పలువురు మంత్రులు, మా జీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు నివాళులు అర్పించారు. గాంధీ దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం భౌతికకాయాన్ని కార్ఖానాలోని ఆమె నివాసానికి తరలించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. మాజీ మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్యాదవ్తో కలిసి అక్కడకు చేరుకొని నందితకు నివాళులు అర్పించారు. ఆమె కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి బీఆర్ఎస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేసీఆర్ ధైర్యం చెప్పారు. పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొం దిన నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం బాధాకరమని, తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబుతో కలిసి సీఎం రేవంత్రెడ్డి కార్ఖానాలోని నందిత నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. నందిత తండ్రి సాయన్నతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. అంతకుముందు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ దవాఖానకు వెళ్లి నివాళి అర్పించారు. లాస్య అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం ఆదేశించారని కోమటిరెడ్డి చెప్పారు. లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులు అర్పించినవారిలో ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీలు కేశవరావు, సంతోష్కుమార్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, దానం నాగేందర్, వేముల వీరేశం, ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నగేశ్, క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, పాటిగడ్డ జగన్మోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
లాస్య నందిత మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించడంతో బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, శంభీర్పూర్ రాజు, రాజీవ్సాగర్, ఎర్రోళ్ళ శ్రీనివాస్, గజ్జెల నాగేశ్తో సహా పెద్ద ఎత్తున నాయకులు, అభిమానులు గాంధీ మార్చురీ వద్దకు చేరుకున్నారు.
ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం పట్ల శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్తోపాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు సంతాపం ప్రకటించారు. నందిత మృతిపై మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రులు మల్లా రెడ్డి, జగదీశ్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, కడియం శ్రీహరి, ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్,జనారెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు ప్రభాకర్రావు, శేరి సుభాష్రెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.
తెలంగాణభవన్లో ఎమ్మెల్యే నందిత చిత్రపటానికి పూలమాల వేసి పలువురు నేతలు నివాళ్లర్పించారు. వారిలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఎం శ్రీనివాస్రెడ్డి, కర్నె ప్రభాకర్, ఆర్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ నాయకులు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తేరుకోలేని షాక్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే లాస్య ఇకలేరు అనే అత్యంత విషాదకరమైన విషయం తెలిసి షాక్కు గురయ్యానని తెలిపారు. యువ శాసనసభ్యురాలిని కోల్పోవడం తీరని నష్టమని పేర్కొన్నారు.