KTR | వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన సమాధానమిచ్చారు. పాదయాత్ర మొదలయ్యేలోపు ఫిట్ అవ్వాలని చూస్తున్నానని చమత్కరించారు.
వచ్చే ఏడాది పాదయాత్ర ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుందని కేటీఆర్ తెలిపారు. 2027లో కచ్చితంగా పాదయాత్ర ఉంటుందని పునరుద్ఘాటించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ టైమ్లో పాదయాత్ర చేయాలనే దానిపై పార్టీలో పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తాను
– కేటీఆర్ pic.twitter.com/74HdVIlcMe
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2026
మా పార్టీ గుర్తు కారు.. ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసు అని మరో ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. మా నాయకత్వం, మా పార్టీ, మా సర్ తయారు చేసిన నాయకులు చాలు రేవంత్ రెడ్డి స్థాయికి అని తెలిపారు. కేసీఆర్ ఇప్పుడే అవసరం లేదని అన్నారు. ఆయన మా తురుపు ముక్క.. ఆయన ఎప్పుడు రావాలో.. ఎలా రావాలో.. ఏం చేయాలో.. ఆయన నిర్ణయించుకుంటారని అన్నారు. ఆయన టైమ్కు ఆయన వస్తారని అన్నారు. ఆయన తెలంగాణ ఓజీ అని అన్నారు.
మా గుర్తు కారు మాకు ఎప్పుడు గేర్ మార్చాలో తెలుసు
రేవంత్ రెడ్డి స్థాయికి మేము చాలు.. మా నాయకుడు కేసీఆర్ అవసరం లేదు
– కేటిఆర్ pic.twitter.com/lqctBOW67g
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2026