KTR | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ సర్కారు ప్రారంభించిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అకసుతో రద్దు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. పదేండ్లలో లక్షల మందికి ఉపయోగపడి, వారి జీవితాల్లో మార్పు తెచ్చిన కార్యక్రమాలను సైతం రాజకీయ దురుద్దేశంతో పకన పెడుతున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు పురోగమించాలనే లక్ష్యంతో కేసీఆర్ సర్కారు తెచ్చిన పథకాలను రాజకీయకోణంలో ఆలోచించి రద్దు చేయటం దారుణమని అన్నారు. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్, హరీశ్రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విమర్శించారు.
గత ప్రభుత్వ పథకాల రద్దుపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందించిన అధికారిక పత్రాలతో లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజల ప్రయోజనాలకు లబ్ధి కలిగించే ఏ కార్యక్రమాన్ని వ్యతిరేకించినా, రద్దుచేసినా ప్రజల తరఫున బీఆర్ఎస్ నిలబడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారం లో ఉన్నా, ఏ పార్టీ ఉన్నా, ప్రభుత్వం అనే వ్యవస్థ శాశ్వతం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, నిధులు ఇచ్చిన రోడ్లు, భవనాలు వంటి ప్రజాప్రయోజన మౌలిక వసతులనూ రద్దు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ జీవో ఇచ్చిందని, లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యి అధికారిక పత్రాలు అందుకున్నవారి పరిస్థితి ఏమిటో స్పష్టం చేయాలని కాంగ్రెస్ సర్కారును డిమాండ్ చేశారు. గొర్రెల పంపిణీ ద్వారా లక్ష ల మంది యాదవుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలిగిందని, ఇలాంటి కార్యక్రమాన్ని కూడా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా తమ వాటాగా డీడీలు కట్టిన వారికి వెంటనే గొర్రెలను పంపి ణీ చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధు పథకాన్ని కూడా రద్దు చేయాలని ఆలోచిస్తున్నదని, రూ.12 లక్షలు ఇస్తామన్న హామీనికి కాంగ్రెస్ కట్టుబడి ఉండాలని అన్నారు. ఈ పథకం కింద ఎంపికైన వారికి తక్షణమే నిధు లు మంజూరు చేసి, యూనిట్లు ప్రారంభం అయ్యేలా చూడాలని చెప్పారు.
పేదలకు మేలు చేసే గృహలక్ష్మిని రద్దు చేసి న కాంగ్రెస్ సర్కారు.. దళితబంధు, గొర్రెల పంపిణీని రద్దు చేయాలని చూడటం ఆయా సామాజిక వర్గాలకు తీరని అన్యాయం చేసినట్లేనని కేటీఆర్, హరీశ్రావు ధ్వజమెత్తారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రజలకు అధికార పార్టీ తీరని ద్రోహం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో లబ్ధిదారులకు అం డగా పార్టీ తరఫున నిరసనలు చేపడతామని తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పట్టణాలు, గ్రామాలకు గత ప్రభుత్వం మం జూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీలు, టీయూఎఫ్ఐడీసీ, ఇతర సంస్థల ద్వారా అందించిన నిధులను రద్దు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. రోడ్లు, భవనాలు, ఇతర పౌర వసతుల కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో వీటిని రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్ల మంజూరును కూడా రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నదన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసి కాంగ్రెస్ సర్కారుపై పోరాడాలని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలకు దిశానిర్దేశం చేశారు.