హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఈ సెంగోల్మాల్ అంటే ఏమిటి అంటూ కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం, ప్రధాని మోదీ వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి ఈ అంశాన్ని అకస్మాత్తుగా తెరపైకి తీసుకువచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను సంస్కారం లేని మూర్ఖులుగా ఆయన అభివర్ణించారు.
రేపిస్టులతో కలిసి సంబురాలు జరుపుకునేవారు, హంతకులను స్వాగతించేవారు, మహాత్మాగాంధీని అవమానించేవారు, పరీక్షా పత్రాలను లీక్ చేసి యువత జీవితాలతో ఆడుకునేవారు, అంతర్జాయ స్థాయి క్రీడాకారులను అవమానించేవారు అంటూ బీజేపీ నేతలపై ట్విట్టర్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.