KTR | ప్రజల తరపున గొంతెత్తి మాట్లాడే దమ్మున్న నాయకుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ను ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.
బోయిన్పల్లి వినోద్ కుమార్ 24 ఏండ్లుగా కేసీఆర్తో నడుస్తున్న సహచరుడు.. ఒక తమ్ముడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన పాల్గొన్న నాయకుడు. మళ్లీ ఈ రోజు కూడా తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు. అలాంటి నాయకుడి గొంతు మనం ర్లమెంట్లో వినాలి. ఆయన సేవలు ఒకసారి గుర్తు చేసుకుంటే 2014లో ఎంపీగా గెలిచిన తర్వాత కరీంనగర్ స్మార్ట్ సిటీని సాధించారు. కేసీఆర్ సూచన మేరకు కరీంనగర్కు రైలును తీసుకొచ్చేందుకు కృషి చేశారు. చదుకున్న వ్యక్తి, విద్యావంతుడు, న్యాయవాది. ప్రజల తరపున గొంతెత్తి మాట్లాడే దమ్మున్న నాయకుడు. వినోద్ కుమార్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నానని కేటీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో ముందు ఉండి నడిచిన నాయకుడు…ఎంపీగా కరీంనగర్కు స్మార్ట్ సిటీని సాధించిన దమ్మున్న లీడర్ బోయినపల్లి వినోద్ కుమార్ గారు.
పార్లమెంటులో మన గొంతు వినిపించేందుకు కారు గుర్తుకు వోటు వేద్దాం.#BoianapalliVinodKumar #ParliamentElection2024 pic.twitter.com/OQB7kwn3xs
— B Vinod Kumar (@vinodboianpalli) May 8, 2024