హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఎకరానికి రైతుబంధు వేయడానికి ఒక సభ పెడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కేంద్రం మీద యుద్దం చేస్తా, పంట కొనిపిస్తా అని మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తీస్మార్ ఖాన్ లాగా డైలాగులు కొట్టిండు. ఇప్పుడు మోదీ ఎంత పంట కొనమని చెప్తే అంతే కొంటా అని బుడ్డర్ ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక ఎకరానికి రైతుబంధు వేయడానికి ఒక సభ పెడుతున్నాడు
కేంద్రం మీద యుద్దం చేస్తా, పంట కొనిపిస్తా అని మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తీస్మార్ ఖాన్ లాగా డైలాగులు కొట్టిండు
ఇప్పుడు మోడీ ఎంత పంట కొనమని చెప్తే అంతే కొంటా అని బుడ్డర్ ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడు
– కేటీఆర్ pic.twitter.com/75PdtmMef2
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2026