హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రైతుబంధు నిధుల విడుదలలో జాప్యంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్రెడ్డి తీరును తూర్పారబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు మేలు జరుగుతుందని నమ్మబలికి, ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు.
‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏడాదికి మూడు పంటలకు రైతుబంధు వేయాలని డిమాండ్ చేసిన రేవంత్రెడ్డి, నేడు అధికారంలోకి వచ్చాక కనీసం ఒక పంటకు కూడా సాయం అందిస్తలేడు’ అని మండిపడ్డారు. డిసెంబర్లోనే రైతుల ఖాతాల్లో చేరాల్సిన రైతుబంధు నిధులు, మార్చి మూడో తారీఖు వచ్చినా రూపాయి కూడా విడుదల కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతుబంధుకు ఈ రాబందు కాంగ్రెస్ మంగళం పాడుతుందని కేసీఆర్ ముందే హెచ్చరించారని, ఆయన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని పేరొన్నారు. తెలంగాణ రైతాంగం మేలోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గమనించాలని పిలుపునిచ్చారు. ఈ మోసపూరిత పాలనను నిలదీయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.