యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని విష్ణు పుష్కురిణి చెంతన గల క్షేత్రపాలకుడికి ఆకు పూజ నిర్వ హించారు. మంగళవారం ఆంజనేయస్వామిని అర్చకులు సింధూరంతో అభిషేకం చేపట్టారు. తమలపాకులతో ఆర్చన జరి పి, లలితాపారాయణం గావించారు. స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేధ్యంగా సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. యాదాద్రీశుడి బాలాయంలో ఉదయం నిజాభిషేకంతో నిత్యరాధనలు ప్రారంభమయ్యాయి.
నిత్య పూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్మీనరసింహుల నిత్య కల్యాణం చేశారు. తొలుత సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. మహా మండపంలో ఆష్టోత్తరం నిర్వహించారు. సాయంత్రం అలంకార సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఆశీస్సులు ఆందజేశారు. యాదాద్రీశుడి సన్నిధిలో శ్రావణమాసంలో ప్రతిష్ఠాత్మంగా జరిపే సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొని వ్రతాలాచరించారు.