హైదరాబాద్, ఫిబ్రవరి8 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) బృందం నాగార్జునసాగర్, శ్రీశైలంతోపాటు పలు ప్రాజెక్టుల సందర్శనకు రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నది. ఇప్పటికే పలు ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన టెలిమెట్రీల పనితీరు, కొత్తగా టెలిమెట్రీలను ఏర్పాటు చేయాల్సిన ఔట్లెట్లను పరిశీలిస్తున్నది.
ఈ పర్యటన బృందంలో కేఆర్ఎంబీ మెంబర్ గుప్తా, అధికారులు అశోక్, రఘునాథ్, శివశంకరయ్య తదితరులున్నారు.