Telangana | హైదరాబాద్ : ఎండలకు తెలంగాణ మండుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దంచికొడుతున్న ఎండలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. మిట్ట మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
బుధవారం రికార్డు స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలురుపాడులో 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలోని గరిమెళ్లపాడులో 45.4 డిగ్రీలు, ఖమ్మం జిల్లాలోని ఖానాపూర్లో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 16 మండలాల్లో 43.1 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నల్లగొండ జిల్లాలో 44.8 డిగ్రీలు, ఆదిలాబాద్ 41.3, భద్రాచలం 42.8, హనుమకొండ 41, హైదరాబాద్ 39.5, మహబూబ్నగర్ 40.8, మెదక్ 40.8, నిజామాబాద్ 40.9, రామగుండంలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.