హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్గా కోరం అశోక్రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రెండో అంతస్థులోని సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి కార్యాలయంలో తన సీట్లో ఆసీనులయ్యారు.
ప్రత్యేక పూజల అనంతరం ఆయన సమాచార, పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్గా, రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా, ఈవో కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అశోక్రెడ్డిని సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, కే వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్లు మధుసూదన్, హష్మీ, సీఐఈ రాధాకిషన్, ఆర్ఐఈ జయరామ్మూర్తి, ఎఫ్డీసీ ఈడీ కిషోర్బాబు అభినందించారు.