హైదరాబాద్: గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించే యువతకు కొప్పుల ఈశ్వర్ ప్రస్థానం స్ఫూర్తిగా నిలుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కొప్పుల ఒక్కోమెట్టు ఎదిగిన తీరును రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్న యవత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సింగరేణి కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి మంత్రి స్థాయికి చేరారని తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారు, కార్మికులకు ఎనలేని సేవలు చేశారని తెలిపారు.
1990వ దశకంలోనే ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టి ప్రజా సేవకు అంకితమయ్యారని చెప్పారు. 2001లో టీఆర్ఎస్లో చేరి 2004లో ఎమ్మెల్యేగా రెండు దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వంలో చీఫ్ విప్గా, క్యాబినెట్ మంత్రి బాధ్యతలను సమర్థవంతంగా పోషించి ప్రజల మన్ననలు పొందారన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ బరిలో నిలిచారన్నారు. రాజకీయంగా అపారమైన అనుభవం, నిబద్ధత ఉన్న నాయకుడని చెప్పారు. ప్రజా సమస్యలపై ఎంతో అవగాహన ఉన్న కొప్పులను ఎంపీగా గెలిపిస్తారని ఆశిస్తున్నానని ఎక్స్ వేదికగా చెప్పారు.
లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగాసింగరేణి బొగ్గుగనుల్లో కొప్పుల ఈశ్వర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్ములు ధరించే యూనిఫాం వేసుకున్నారు. సింగరేణి మాజీ ఘని కార్మికుడిగా చాలా రోజుల తర్వాత యూనిఫాంలో అంటూ ఆ ఫొటోనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై కేసీఆర్ పైవిధంగా స్పందించారు.
Koppula Eshwar Garu’s story is one that can inspire youngsters who aspire to become successful leaders
He started his career as an ordinary Singareni worker in late 80s, was an integral part of the struggle for rights of workers through trade union
Joined public life in late… https://t.co/nekd6wfSAH
— KTR (@KTRBRS) April 11, 2024