హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): మోదీ సర్కార్ రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న విషయం మరోసారి స్పష్టమైందని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన విచారణ సంస్థలు తమపార్టీ అభీష్టం మేరకే పని చేస్తున్నాయని బీజేపీకి చెందిన రాష్ట్ర నాయకుడు కొండా విశ్వశ్వేర్రెడ్డి అంగీకరించారని తెలిపారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలు బీజేపీ పంజరంలోని చిలుకలు అన్న విషయం విశ్వేశ్వర్రెడ్డి మాటలతో స్పష్టమైందని తెలిపారు.
బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం కేసుల పేరుతో వేధిస్తున్నదనేది నూరు శాతం నిజమని అన్నా రు. మోదీ, అమిత్ షా ఇద్దరు కలిసి పూర్తిగా దేశా న్ని తమ చేతుల్లోకి తీసుకొని తమ మిత్రులైన అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. అదానీ 20 లక్షల కోట్ల సాం చేసినా కనీసం నోరు తెరవని ప్రధానమంత్రి అపోజిషన్ పార్టీల నేతలను కేసుల పేరుతో వేధిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యవాదులు ఇప్పటికైనా బీజేపీ కుటిల నీతిని గుర్తించాలని సూచించారు.