సంగారెడ్డి : తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపు జీ పాత్ర గొప్పది. తెలంగాణ కోసం మంత్రి పదవిని గడ్డి పోచలా వదిలేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపు జీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
ఆదివారం పఠాన్చెరు బస్ స్టాండ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కొండా లక్ష్మణ్ గాంధీ స్ఫూర్తితో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. నాటి నుంచి తాను మరణించే వరకు ప్రజా ఉద్యమాల్లో ఉన్నారని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం నేషనల్ హ్యాండ్ లూమ్ బోర్డ్, హ్యాండీ క్రాఫ్ట్ బోర్డును రద్దు చేసింది. కేంద్రం
నూలు మీద సబ్సిడీ రద్దీ చేసి చేనేత రంగాన్ని దెబ్బ తీసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల ఉసురు పోసుకుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
కుల వృత్తులను కాపాడనికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది.
వరంగల్లో 1200 ఎకరాల్లో మెగా టెక్స్ట్ టైల్ పార్కు రాబోతుందని మంత్రి తెలిపారు. బాపు జీ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. కాంగ్రెస్ నాయకులు కొండా లక్ష్మణ్ బాపు జీని పట్టించుకోలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.