హైదరాబాద్ : వరంగల్లో ఇవాళ నిర్వహించే రాహుల్ గాంధీ సభకు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నట్లు సమాచారం. రాహుల్ సభకు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో వారం రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పలుమార్లు పరిశీలించింది. దాదాపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ, ఇతర నాయకులు హనుమకొండలో బిజీగా గడుపుతున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు హనుమకొండ వైపు వెళ్లనేలేదు.
క్యారెక్టర్ లేని వారి దగ్గర పని చేయలేనంటూ కొద్ది రోజుల క్రితం నియోజకరవ్గం నాయకులతో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉన్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వమంతా ఇటీవల ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు.