పెద్దఅడిశర్లపల్లి: కోదాడ-జడ్చర్ల 167 జాతీయ రహాదారికి హారిత శోభ సంతరింకుంది. ఇటీవల మండల పరిధిలో జాతీ య రహాదారిని విస్తరించిన క్రమంలో నరికివేసిన మొక్కల కంటే పది రెట్లు అదనంగా హారితహారంలో భాగంగా రెండు మూడు వరుసల్లో మొక్కలు నాటి వాటిని సంరంక్షించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వాటిని పరిశీలిస్తూ రాబోయే రోజుల్లో మహా హారితవనంగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
మండలంలోని కోదాడ నుంచి ప్రారంభమైన జాతీయ రహాదారి ఘాట్నెమలిపురం నుంచి చిలకమర్రి సంజీవని ట్రస్ట్ వరకు 11కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ రహాదారి ఘాట్నెమలిపురం, కోదండపురం, ఘనపురం, అక్కంపల్లి, అంగడిపేట, చిలకమర్రి గ్రామ పంచాయతీలకు పరిధిలో ఉండడంతో గత యేడాది 4వేల మొక్కలు నాటగా ఈ యేడు ఇప్పటివరకు 5 వేల మొక్కలు నాటి మరో వెయ్యి మొక్కలు నాటేందుకు అకారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నాటిని మొక్కలను సంరంక్షించే భాధ్యత రహాదారి విస్తరించి ఉన్న ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగించి ప్రతి కిలో మీటరుకు ప్రత్యేక వాచర్ ఏర్పాటు చేయడంతో పాటు ఉపాధిహామీ కూలీలచే వాటిని సంరంక్షిస్తున్నారు. గ్రామపంచాయతీ ట్యాంకర్లతో నీటిని అందిచండంతో పాటు చనిపోయిన మొక్కల స్థానంలో నూతన మొక్కలను కూడా ఏర్పాటు చేస్తున్నా రు. స్థానిక నర్సరీలో కాకుండా రాజమండ్రి లాంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక నర్సరీలలో మొక్కలు కొనుగొలు చేసి రహాదారిపై ఏపుగా పెరిగే మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇటీవల జిల్లా కలెక్టర్ సైతం జాతీయ రహాదారిపై నాటిన మొక్కలను పరిశీలించి మొక్కలపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటిన మొక్కలను రహాదారి విస్తరణలో తొలగించకుండా చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే ఆథారిటీ అధికారులకు సైతం అదేశాలు జారీ చేశారు.
ఇప్పటివరకు 5 వేల మొక్కలు నాటాం: ఎంపీడీవో యాదగిరి
జాతీయ రహాదారికి ఇరువైపులా ఈ యేడు హారితహారంలో 5 వేల మొక్కలు నాటాం. మరో వెయ్యి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మొక్కల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటీ పంచాయతీ అధికారులకు కఠినంగా ఆదేశాలు జారీ చేశాం. గతంలో నాటిన,మొక్కలు చనిపోయిన వాటి స్థానంలో నూతన మొక్కలు నాటాం.