హైదరాబాద్ : కాంగ్రెస్(Congress) పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదు. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను(Six guarantees) ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారని కేంద్రమంతి కిషన్ రెడ్డి(Kishan Reddy )అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలపై చేతులెత్తేసిందని విమర్శించారు.
ఆరు గ్యారంటీలు అయ్యేది కాదు, పొయ్యేది కాదు అన్నట్లుగా ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ఇచ్చిన హామీ మేరకు గ్యారంటీలను అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం ఉద్యమిస్తామని చెప్పారు.