హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ఈ గ్యారంటీలపై దమ్ముం టే చర్చకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి కేంద్రమంత్రి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. శనివారం తుక్కుగూడ సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పం దించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మ్యానిఫెస్టోను తుకుగూడలోనే విడుదల చేశామని, అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకొన్నామంటూ రాహుల్ మా ట్లాడటం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. రైతుల రుణమాఫీ, నిరుద్యోగ భృతికి దిక్కులేదని, డిక్లరేషన్ల అమలు ఊసేలేదని నిప్పులు చెరిగారు.