హైదరాబాద్: కొత్త ఏడాది నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. శుక్రవారం ఒక్కరోజే రూ.172 కోట్ల మేర మద్యం అమ్ముడయింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.76 లక్షల కేసుల లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.42.26 కోట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.24.78 కోట్లు, హైదరాబాద్ రూ.23.13 కోట్ల మద్యం అమ్ముడుపోయింది.
దీంతో మద్యం అమ్మకాలు డిసెంబర్ నెలలో రికార్డు స్థాయికి చేరాయి. గత నెలలో మద్యం అమ్మకాలు రూ.3459 కోట్లు జరిగాయి. ఇందులో 40.48 కేసుల లిక్కర్, 34 లక్షల కేసులకుపైగా బీర్ల అమ్మకాలు ఉన్నాయి. మొత్తంగా 2021లో రూ.30,222 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు జరిగాయి.