ఖమ్మం : ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లో శ్రామణమాసం బోనాల జాతర మొదలైంది. మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం ముత్యాలమ్మ జాతర పండుగ వాతావరణం నెలకొంది. ఇంటింటికీ మామిడి తోరణాలను కట్టుకొని ఇండ్లను అందంగా అలంకరించుకున్నారు. గ్రామాల్లో ప్రజలంతా కలిసి ఒకేసారి ముత్యాలమ్మ పండుగను జరుపుకోవడంతో సందడి నెలకొంది.
ఈ సందర్భంగా మహిళలు ఉదయాన్నే ఇండ్లల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
అంతేకాక ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక నైవేద్యాన్ని వండి బోనం తయారు చేసి తలపై పెట్టుకొని డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా బయలెళ్లారు. ముందుగా గ్రామాల్లోని బొడ్రాయికి నీళ్లు పోసి పూజలు చేశారు. అనంతరం మహిళలు బోనాలతో ఊరేగింపుగా బయలెళ్లి ముత్యాలమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
పాండురంగాపురంలో రజకులతో ముందుగా ముత్యాలమ్మ జాతర ప్రాంరభమైంది. వేడుకల్లో రజక సంఘం నేతలు తంగెళ్లపల్లి శ్రీనివాస్, చింతపట్ల నర్సింహారావు, చిలుకూరి వెంకటేశ్వర్లు, దూదిగాని నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ డెల్టా వేరియంట్ వ్యాప్తి!
విషాదం : కాన్పుకోసం వచ్చి మహిళ మృతి
పొంగిపొర్లుతున్న పొచ్చెర జలపాతం