KGBV | నిర్మల్ : నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది బాధిత విద్యార్థినులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్!
11 మంది విద్యార్థినులకు అస్వస్థత
నిర్మల్ – నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థినులు భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు.
దీంతో పాఠశాల సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి… pic.twitter.com/x9nj02zw5p
— Telugu Scribe (@TeluguScribe) April 20, 2024