హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో కేరళ సీఎం పినరయి విజయన్ సమావేశం అయ్యారు. సీఎం విజయన్తో పాటు సీతారాం ఏచూరి కూడా కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేరళలో పెట్టుబడులపై చర్చిస్తున్నారు. సీపీఎం కేంద్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు పినరయి విజయన్ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన్ను.. సీఎం కేసీఆర్ లంచ్కు ఆహ్వానించారు.