BRS | హైదరాబాద్, మార్చి 31, (నమస్తే తెలంగాణ) : దేశ రైతాంగాన్ని ఏకం చేసేందుకు, వారిలో రాజకీయ చైతన్యాన్ని రగిల్చేందుకు భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన నినాదం ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ గ్రామీణ ప్రాంతాల్లో మార్మోగుతున్నది. నాందేడ్లో, లోహాలో నిర్వహించిన బీఆర్ఎస్ సభల తర్వాత మహారాష్ట్రలో ముఖ్యంగా మరాఠ్వాడ ప్రాంతంలోని పల్లెల్లో కేసీఆర్ నినాదంపై విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో.. ఊరూరా తిరిగి భజనలు చేసే ‘కీర్తన్కార్’ ఒకరు కిసాన్ సర్కార్ రావాల్సిన అవసరాన్ని గ్రామీణులకు చెప్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
తెలంగాణతో పోల్చి మహారాష్ట్ర వెనుకబాటును ప్ర శ్నించిన ఆయన.. అక్కడి పార్టీల వైఖరినీ ప దునుగా విమర్శించారు. మరాఠీలో ఆయన మాటల సారాంశం ఇలా.. ‘పక్కనున్న తెలంగాణ రైతులకు అన్నీ ఇవ్వగలుగుతున్నప్పు డు.. మహారాష్ట్ర ఎందుకు ఇవ్వలేకపోతున్నది? ఈ పరిస్థితికి ఇక్కడున్న పార్టీలే కారణమని చెప్పాలి. కాంగ్రెస్, నేషనలిస్టు కాం గ్రెస్, బీజేపీ అన్నీ విషపు పాములే. రైతుల సంక్షేమం గురించి ఆలోచించే, రైతుల కోసం పనిచేసే సర్కారు కావాలి మనకు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ రావాల్సిందే’ అని సదరు కీర్తన్కార్ పేర్కొన్నారు.