జగిత్యాల, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): జగిత్యాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఆటంకాలు కలిగించేందుకు సర్కార్ కుట్ర పన్నింది. ఇందులో భాగంగా నిజామాబాద్ రూట్లో జాతీయ రహదారి 63పై వంతెన నిర్మాణం పేరిట రోడ్డు తవ్వేశారు. దీనిపై మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసి, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వం దిగివచ్చింది.
ఆగమేఘాల మీద అప్రోచ్రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. సోమవారం మధ్యాహ్నం వరకు రోడ్డుపై రాకపోకల పునరుద్ధరణ జరిగే అవకాశాలు కనిపించడంతో కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్ వైపు నుంచి వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తొలగినట్టే.