మొన్నటిదాకా లేని నీటిగోస ఇప్పుడెట్లొచ్చె?
ప్రాజెక్టులు ఇప్పుడెందుకు ఎండిపోయినయి?
ఈ ప్రభుత్వం కరెంటు, నీళ్లు ఎందుకిస్తలేదు?
కేసీఆర్ను ఇప్పుడు రావే.. రావే అంటున్నరు
కత్తొకనికిచ్చి యుద్ధం ఇంకొకర్ని చెయ్యిమంటెట్ల?
తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయే
తెలంగాణను ఆగం పట్టించేందుకు కొందరు రెడీగా ఉంటరు.. యువత జాగ్రత్తగ ఉండాలె
కుట్రలను పసిగట్టాలె..రాష్ర్టాన్ని కాపాడుకోవాలె
భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు అనుగు ణంగా ప్రజల శ్రేయస్సు ను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వాలు పనిచెయ్యాలె. అంతేతప్ప వాటిని ఖర్చుకు లింకుపెట్టి ఆలోచన చేయడం తప్పు. తెలంగాణకు సాగు, తాగు నీళ్లు అవసరం. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుకు వెనుకాడకుండా ప్రజలకు మంచినీళ్లు, వ్యవసాయానికి సాగు నీళ్లు అందించాల్సిందే.
-కేసీఆర్
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసింది. వాళ్ల తెలివితకువతనాన్ని ఉద్యమ కాలంలో దద్దమ్మలు, సన్నాసులు అని సమాజం తరఫున ప్రశ్నించా. వ్యక్తిగతంగా కోపమెందుకుంటది?
-కేసీఆర్
KCR | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): నిరుడు మండు వేసవిలోనూ నిండు కుండల్లా తొణికిసలాడిన భారీ ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయి కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. రాష్ట్రంలో పదేండ్లు లేని నీటి గోస ఇప్పుడెందుకొచ్చిందని ప్రశ్నించారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనలో గోదావరి, కాళేశ్వరం ప్రాజెక్టులు అలుగులు దుంకాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు, కుంటలు అడుగంటి ఎడారిగా మారాయని వాపోయారు.
‘తలాపున పారుతుంది గోదారి నీ చేను నీ చెలుక ఎడారి’.. అని నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీటి కష్టాలను వివరిస్తూ, నాటి కవి సదాశివుడు రాసిన పాటను తిరిగి గుర్తు చేసుకొనే పరిస్థితులు తలెత్తడం శోచనీయమని పేర్కొన్నారు. ఎండిన గోదావరి కన్నీటి గోసను, కాళేశ్వరం నీళ్లందక పంటలు ఎండిన రైతుల గుండె కోతను సభ్య సమాజానికి తెలిపేందుకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం నుంచి ఎర్రవల్లి వరకు (180 కి.మీ) 200 మంది చేపట్టిన పాదయాత్ర వారం పాటు సాగి శనివారం ముగిసింది.
ఎర్రవల్లి నివాసంలో తన అధ్యక్షతన నిర్వహించిన ముగింపు సభలో కేసీఆర్ మాట్లాడారు. పోయిన సంవత్సరం ఇదే రోజు నిండు కుండల్లా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయాయో, ఇందుకు కారణం ఎవరనేది సమాజానికి తెలియజేసేందుకు కోరుకంటి చందర్ అధ్వర్యంలో పాదయాత్ర చేయడం అభినందనీయమని కొనియాడారు. పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒకరినీ కేసీఆర్ అభినందించారు.
తెలంగాణ సంపదను కొల్లగొట్టేందుకు అందరు గుంటనకల మాదిరిగా కన్నేశారని, వీరి పట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణను ఆగం చేసే కుట్రలను ఎప్పటికప్పుడు పసిగట్టి కాపాడుకోవాలని సూచించారు.
కొట్లాడి తెలంగాణను సాధించుకున్నామని, ఎంతో జాగ్రత్తగా దాన్ని నిలబెట్టుకున్నామని కేసీఆర్ చెప్పారు. ‘ప్రజలు ఏమనుకున్నారో ఏందో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నరు. అది వాళ్లిష్టం. కానీ దాని ఫలితం లోకం చూస్తున్నది. ఇన్నాళ్లు లేని నీటి గోస ఇప్పుడెందుకు వచ్చినట్టు? తెలంగాణకు నీళ్లివ్వాలనే పాలనా ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే తెలంగాణకు సాగు, తాగు నీళ్ల సమస్య వచ్చింది. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు మొదటి నుంచీ నీటి సమస్యను ఆర్థిక సమస్యగా చూడటం ఒక అవలక్షణంగా మార్చుకున్నారు.
గల్ఫ్ లాంటి ఎడారి దేశాల్లో నీళ్లుండవు. అకడి ప్రభుత్వాలు సముద్ర జలాల నుంచి ఉప్పును వేరుచేసి నీటిని శుద్ధి చేసి మంచినీళ్లుగా వాడుకుంటారు. మద్రాస్లో కూడా నీటి కొరతను అధిగమించేందుకు అటువంటి కార్యాచరణను చేసిండ్రు. భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల శ్రేయస్సును పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వాలు పనిచెయ్యాలె. అంతేతప్ప వాటిని ఖర్చుకు లింకుపెట్టి ఆలోచన చేయడం తప్పు. తెలంగాణకు సాగునీరు, తాగునీరు అవసరం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుకు వెనుకాడకుండా ప్రజలకు తాగునీరు, వ్యవసాయానికి సాగు నీరు అందించాల్సిందే’ అని కేసీఆర్ స్పష్టంచేశారు.
గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది వంటి గోరటి వెంకన్న పాటల స్ఫూర్తితో పేదలకు ఇండ్లు నిర్మించినం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చేస్తుంటే.. కేసీఆర్ అన్నా.. ఎకడున్నవు రావే.. రావే.. అని బాధతోటి పిలుస్తున్నరు. నన్ను ఓడగొట్టి ఇంట్ల కూర్చోబెట్టిండ్రు ! ఇప్పుడు నేను ఏడికి రావాలె? కత్తి ఒకనికిచ్చి యుద్ధం ఒకరిని చెయ్యిమంటే ఎట్లయితది?
– కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం సిద్ధించగానే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, వ్యవసాయ స్థిరీకరణపై దృష్టి పెట్టి పటిష్టమైన కార్యాచరణను అమలు చేసిందని కేసీఆర్ గుర్తుచేశారు. ‘వ్యవసాయ రంగ అభివృద్ధిని పాలనా ప్రాధాన్య అంశంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంచుకున్నది. అందులో భాగంగా ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందివ్వడం. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు ఉచితంగా అందించడం.. పంట పెట్టుబడి సాయం చేయడం.. పండిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయడం అనే అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని ఎన్ని కష్టాలొచ్చినా నాటి అమలు చేసింది.
కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం వీటిని అందించేందుకు ఖర్చవుతుందని వెనుకాడుతున్నది. ఇది సరికాదు. ఎప్పుడైనా ప్రభుత్వాలే రైతుల దగ్గర భూమి శిస్తులు వసూలు చేసిన సందర్భాలున్నాయి. కానీ, ఉల్టా ప్రభుత్వమే రైతుకు భరోసా కల్పించేలా పంట పెట్టుబడి అందించిన పరిస్థితి ఈ దేశంలో ఉన్నదా? రైతు సంక్షేమం దిశగా ఆలోచించింది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ పరిస్థితులను తెలంగాణ సమాజం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలె. మనం ఇచ్చిన కరెంటు ఎటు పోయింది? మనం ఇచ్చిన మిషన్ భగీరథ తాగునీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నరు? ఎండాకాలంలో కూడా మత్తడి దుంకిన చెరువులు ఇప్పుడు ఎందుకు నీరు లేక ఎండిపోతున్నాయో.. ప్రజలు అర్థం చేసుకోవాలె’ అని కేసీఆర్ సూచించారు.
పల్లెల నుంచి హైదరాబాద్ వంటి పట్టణాలకు బతకడానికి వచ్చిన పేదలకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ల ఇండ్లను కూల్చివేస్తున్నదని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘గోరటి వెంకన్న లాంటి కవులు రాసిన.. గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది.. వంటి పాటల స్ఫూర్తితో పేదలకు ఇండ్ల నిర్మాణం చేపట్టినం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చేస్తుంటే.. కేసీఆర్ అన్నా.. ఎకడున్నావు రావే.. రావే.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ, నన్ను ఓడగొట్టి ఇంట్ల కూర్చోబెట్టిండ్రు కదా! నేను ఎకడికి రావాలె? కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఒకరిని చెయ్యిమంటే ఎట్లా అయితది?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణకు మొదటి నుంచి ప్రధాన శత్రువే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను మొదటినుంచీ కనీస స్థాయిలో ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసింది. వాళ్ల తెలివితకువతనం చూసి ఉద్యమ కాలంలో నేను వాళ్లను దద్దమ్మలు, సన్నాసులు అని తెలంగాణ సమాజం తరఫున అన్న తప్ప, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీదా కోపమెందుకుంటది?
– కేసీఆర్
‘ఇప్పుడున్న పాలకులు సరిగా చేస్తలేరట! మంచిగ పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట! తెలంగాణలో వచ్చేసారి ఎన్డీయే కూటమి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నయి. అంటే తెలంగాణను తెర్లు చేయాలని చూసే వాళ్ల పరిస్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణను ఆగం చేయడానికి కొందరు రెడీగా ఉంటరు. వీరి పట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలె. ఎప్పటికప్పుడు తెలంగాణను ఆగం చేసే కుట్రలను పసిగట్టి రాష్టాన్ని కాపాడుకోవాలె’ అని కేసీఆర్ సూచించారు.
‘ఒక్క పొరపాటు జరిగితే జీవితకాలం దుఃఖపడాల్సి వస్తది. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే.. ఏకాణా కూడా పని కాలేదు. తెలంగాణ నుంచి మన బీఆర్ఎస్ ప్రతినిధులను పార్లమెంటుకు పంపిస్తే కొట్లాడి మన హక్కులు కాపాడుకుందుము కదా! మన దగ్గర ఎంపీల బలం ఉంటే, కేంద్రం మీద ఒత్తిడి చేసి రాష్ర్టాన్ని బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఈ దిశగా తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలె’ అని సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, ఎమ్మెల్యే పుట్ట మధు, పాదయాత్ర చేసిన బీఆర్ఎస్ నేతలు, వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు
తెలంగాణకు మొదటి నుంచి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి నేటి దాకా పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను కేసీఆర్ వివరించారు. నెహ్రూ సహా ఇందిరాగాంధీ, సోనియాగాంధీ నుంచి నేటిదాకా తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహాలను వెల్లడించారు. తెలంగాణను ఆంధ్రాలో కలపడం నుంచి, 1969లో వందలాది మంది బిడ్డలను పొట్టన పెట్టుకోవడం నుంచి, నీళ్లు నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు దశాబ్దాల కాలంగా జరిగిన అన్యాయాలను పూసగుచ్చినట్టు వివరించారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను మొదటినుంచీ కనీస స్థాయిలో ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘వాళ్ల తెలివి తకువ తనం చూసి, ఉద్యమ కాలంలో నేను వాళ్లను దద్దమ్మలు, సన్నాసులు అని తెలంగాణ సమాజం తరఫున అన్న తప్ప, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీదా కోపం ఎందుకు ఉంటుంది? అని చెప్పారు.
ఇప్పుడున్న పాలకులు పనిచేస్తలేరట! మంచిగ పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట! తెలంగాణలో వచ్చేసారి ఎన్డీయే కూటమి రావాలని కొన్ని పత్రికలు రాస్తున్నయి. తెలంగాణను తెర్లు చెయ్యడానికి కొందరు రెడీగా ఉంటరు. వీరి పట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలె. ఎప్పటికప్పుడు తెలంగాణను ఆగం చేసే కుట్రలను పసిగట్టి రాష్టాన్ని కాపాడుకోవాలె.
-కేసీఆర్
‘కేసీఆర్ ప్రభుత్వంలో పదేండ్ల పాటు ప్రశాంతంగా బతికామని తెలంగాణ సమాజం భావిస్తున్నది. ఇప్పుడు మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలైనయి. తెలంగాణకు ఎప్పుడూ ఇదే లొల్లా? ప్రశాంతంగా బతుకొద్దా? తెలంగాణ సమాజం ఇకనైనా తెలివిగా ఆలోచన చేయాలి. పాదయాత్రలు కాదు.. మన మనసుతో యాత్రలు చెయ్యాలె. బుర్రతో ఆలోచనలు చెయ్యాలె. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను పాడు చేసుకునే ఆలోచనలు కాకుండా మన భవిష్యత్తు తరాలను మరింతగా బాగు చేసుకునే దిశగా ఆలోచన చెయ్యాలె’ అని ఉద్బోధించారు.