CM KCR | ‘ఛోటే భాయ్ సుభానల్లా.. బడే భాయ్ మాషా అల్లా’ అన్నట్లు ప్రధాని మోదీ, రాహుల్ వ్యవహారం ఉందని సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చల అనంతరం.. సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఎన్నికలు జరిగినప్పుడు నాయకులు, పార్టీలు గెలుస్తన్నయ్ కానీ ప్రజలు ఓడిపోతున్నారు. ఇది ఈ దేశం చేసుకున్న దురదృష్టకరం. 2014 మోదీ గెలిచి ఎందుకు గెలిచారు. కాంగ్రెస్ పనికిరాకుండా పోయింది. మన్మోహన్ సింగ్ మంచి వ్యక్తి. ఆయనపై బదనాం పెట్టారు. ఆయన పని ఎక్కువ చేస్తారు. ఆయన ప్రచారం ఎక్కువ చేసుకోరు. ఎవరు ఏం చేశారో మా వద్ద లెక్కలున్నయ్. మోదీ కంటే మన్మోహన్ బేతరిన్ పని చేశారు, కానీ చెప్పుకోలేదు. లొల్లిపెట్టి, దేశాన్ని నమ్మించి మేం ఏందే చేస్తామని చెప్పారు. పూజా మెహ్రా ప్రముఖ ఆర్థికవేత్త, జర్నలిస్ట్ ‘ద లాస్ట్ డికేడ్’ అనే పుస్తకం రాశారు. పది సంవత్సరాల మోదీ, మన్మోహన్ సింగ్ పాలనలో ఏం జరిగిందో ఉంది’ అని తెలిపారు.
‘వాస్తవానికి ప్రజలు పౌరసత్వం వదులుకొని పోతున్నరు. పారిశ్రామికవేత్తలు పోరిపోతున్నరు. పరిశ్రమలు మూతపడుతున్నయ్. ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. వెరసి 2014లో మోదీ ఏమో చేస్తడని అధికారం అప్పగిస్తే.. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లయ్యింది ప్రజల పరిస్థితి. మోదీ, బీజేపీ పార్టీ గెలిచింది.. భారతదేశ ప్రజలు ఓడిపోయారు. భారతదేశ ప్రజల ఓటమిలో భాగంగా తెలంగాణ కూడా కొంత ఓడిపోయింది. ఇవాళ రాష్ట్రం జీఎస్డీపీ 13.27కోట్లు. వాస్తవంగా మోదీ ప్లేస్లో మన్మోసింగ్ ఉన్నా.. భారతదేశ ప్రభుత్వం.. తెలంగాణ లెక్క పని చేసినా జీఎస్డీపీ 16లక్షల కోట్లు ఉండాల్సి. ఒక్క తెలంగాణనే రూ.3లక్షలకోట్లు నష్టపోయింది. ఇది భవిష్యత్ తరాలకు తెలియాలని చెబుతున్నా. మన్మోహన్ హయాం, మోదీ హయానికి పోల్చుకుంటే ప్రతిరంగంలో దేశం నష్టపోయింది. తమాషా ఏంటంటే.. దాంట్లో కూడా దివాళా తీసుకుంటూ మేమే గొప్పొళ్లమని చెప్పుకుంటున్నరు. ఘోరమైన స్పీచ్ ప్రధానిది పార్లమెంట్లో.. అదానీ సంగతి ఏంటీ? దేశం ఉనికి ఏందీ?.. ఏం జరుగబోతోంది ఈ దేశంలో.. ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతున్నది? ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ఢిల్లీలో ప్రధానిని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కమాట మాట మాట్లాడాల్సింది’ అన్నారు.
‘భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలా? వ్యవస్థలు ఎలా ఉన్నాయ్ ? సెబీ ఎలా ఉన్నది? అని అంతర్జాతీయ పెట్టుబడుదారులు చూస్తారు. పెట్టుబడిదారులు థర్డ్క్లాస్ కంట్రీ అంటే దెబ్బతినిపోతాం. హిడన్బర్గ్ ఏం స్టడీ ఏం చేసిందో.. మనకు తెలియదు. ఒకే దెబ్బకు రూ.10లక్షలకోట్ల ఆస్తులు కరిగిపోయినయ్ అని చెబుతున్నయి. 108 బిలియన్ డాలర్లు కనిగిపోయినయ్.. ఆ సంస్థ ఉంటదా? ఆయన ఉంటాడా?.. ఆయన మదగ్గర కూడా పెట్టుబడులు పెడుతామని వచ్చాడు.. రాకపోవడమే మంచిదైంది. ఈ కంపెనీల్లో భారతీయ బ్యాంకులు, ఎల్ఐసీ పెట్టబడులు పెట్టాయి. ఎల్ఐసీలో 25కోట్ల డిపాజిటర్లు ఉన్నారు. ఇందులో ప్రజలను బీమా కట్టారు. పాలసీదారులందరూ ఆందోళనకు గురవుతున్నారు. ప్రధాని నోటి నుంచి ఒక్కమాట కూడా రాలేదు. కానీ, మా దోస్తు భాగోతం బయటపడిందనే ఆక్రోశం ప్రధానిలో కనిపించింది. ఎన్నడో చనిపోయిన నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లను తీసుకువచ్చి ఆమె గర్నమెంట్లు కూలగొట్టిందని మోదీ చెప్పారు. రాహుల్ గాంధీ లేచి నువ్వు తక్కువ కూలగొట్టినవా అని చెబుతున్నరు. ఛోటే భాయ్ సుబానల్లా.. బడేబాయ్ మాష అల్లా అన్నట్లుంది. నువ్వెంటి కూలగొట్టినవ్ అంటే.. నువ్వు ఎన్ని కూలగొట్టినవ్ అంటున్నరు. అదానీ వ్యవహారం ఏందీ.. దేశం ఎక్కడపోతుంది? ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంది. 75 సంవత్సరాల పరిపక్వం చెందిన దశలో ఇదేనా జరగాల్సిన చర్చా?’ ప్రశ్నించారు.