జగిత్యాల కలెక్టరేట్/రాయికల్, ఏప్రిల్ 19: జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. హెలికాప్టర్లో సాయంత్రం 5.30 గంటలకు జగిత్యాల కలెక్టరేట్ ఆవరణలోని హెలీపాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్లో జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్తారు.
పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు బహిరంగ సభ జరిగే మినీ స్టేడియానికి బయలుదేరుతారు. 6.10 గంటలకు బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు.