కమలాపూర్, సెప్టెంబర్ 1 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ టీఆర్ఎస్ గెలుపునకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ జిల్లా కమలాపూర్లో 1, 2, 3, 8, 9వ వార్డుల్లో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం దళితుల ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ని పరిచయం చేశారు. ఆయా కార్యక్రమాల్లో బాల్క సుమన్ మాట్లాడుతూ.. స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, వృద్ధులకు, వికలాంగులకు ఆసరా పెన్షన్లు, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, దళితబంధు పథకంతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషిచేస్తున్నట్టు చెప్పారు.
కేసీఆర్ స్ఫూర్తితో ప్రజాసేవకు: గెల్లు శ్రీనివాస్
ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని గెల్లు శ్రీనివాస్యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే ప్రజలకు సేవ చేసేందుకు వచ్చినట్టు తెలిపారు. బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో ఓట్ల కోసం వచ్చే నాయకులను నిలదీయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఇనుగాల కిరణ్మయి, దాసరి రమేశ్, మాట్ల రవీందర్, మండల ఇన్చార్జి పేర్యాల రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.