BRS | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగే మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేసింది. మాల్కాజిగిరి స్థానాన్ని రాగిడి లక్ష్మారెడ్డికి, ఆదిలాబాద్ను ఆత్రం సక్కుకు కేటాయించినట్టు పార్టీ అధినేత కేసీఆర్ గురువారం ప్రకటించారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 11 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్లోని తన నివాసంలో కేసీఆర్ గురువారం ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
మాజీ మంత్రులు జోగు రామన్న, సముద్రాల వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్జాదవ్, పార్టీ నేతలు రవీందర్రావు, లోలం శ్యాంసుందర్ తదితరులతో సమావేశమైన కేసీఆర్ ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని రాజకీయ, సామాజిక అంశాలతోపాటు క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై ఆరాతీశారు.
కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం తప్పదు: పోచారం
బాన్సువాడ టౌన్, మార్చి 14: రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ జహీరాబాద్ లోక్సభ అభ్యర్థిగా ఎంపికైన గాలి అనిల్కుమార్ గురువారం బాన్సువాడలో శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయనతో చర్చించినట్టు సమాచారం.
బీఆర్ఎస్ ప్రకటించిన 9 స్థానాలు ఇవే
లోక్సభ స్థానం : బీఆర్ఎస్ అభ్యర్థి
ఆదిలాబాద్ : ఆత్రం సక్కు
మల్కాజ్గిరి : రాగిడి లక్ష్మారెడ్డి
ఖమ్మం : నామా నాగేశ్వర్రావు
మహబూబాబాద్ (ఎస్టీ) : మాలోత్ కవిత
కరీంనగర్ : బోయినిపల్లి వినోద్కుమార్
పెద్దపల్లి(ఎస్సీ) : కొప్పుల ఈశ్వర్
మహబూబ్నగర్ : మన్నె శ్రీనివాస్రెడ్డి
చేవెళ్ల : కాసాని జ్ఞానేశ్వర్
వరంగల్ (ఎస్సీ) : డాక్టర్ కడియం కావ్య
జహీరాబాద్ : గాలి అనిల్కుమార్
నిజామాబాద్ : బాజిరెడ్డి గోవర్ధన్