KCR | కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెల్లడించారు. టీవీ9 డిబేట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మనకు ఉండేవి రెండే నదులు. ఒకటి గోదావరి. రెండోది కృష్ణ. ఉమ్మడి రాష్ట్రంలో ఏస్తామన్న ఏ ప్రాజెక్టు చేయలేదు. అందులో శ్రీరామ్సాగర్ మొదటి దశకే సరైన పద్ధతిలో నీళ్లురాని పద్ధతి. తెలంగాణ ఉద్యమం, గులాబీ జెండాకు దడిసి రెండోదశ చేస్తే అసంపూర్తిగానే ఉంది. నీళ్లు రాలేదు. దేవాదుల, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ పూర్తి కాలేదు. కల్వకుర్తి ఎత్తిపోతల ఏదీ పూర్తి కాలేదు. అన్ని కెలకటం వదిలేయడం. ప్రాజెక్టులు కదడదమని మొదలుపెట్టిన ఎల్లంపల్లి, మిడ్మానేరు పూర్తి కాలేదు. అన్నీ అసంపూర్తిగానే మిగిలాయి. వాస్తయన్న నీళ్లు రావు. తెలంగాణ వచ్చింది.. మేం అధికారంలోకి వచ్చాం. ఆరు నెలలు ఆలోచించాం. సమైక్య పాలకులకు ఒక గర్వం ఉండేది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ కానివ్వమనే అహంకారం ఉండేది’ అన్నారు.
‘కానీ, ఆ టైమ్లో ఏం చేశారంటే.. గోదావరిలో 968 టీఎంసీలు మంజూరు చేస్తున్నట్లుగా జీవోలు తీసి ఆర్డర్ ఇచ్చారు. చేసేదా సచ్చేదా? తెలంగాణ రాష్ట్రం కాదు.. ఇలాగే బఫ్ల్ చేద్దామని అనే పద్ధతిలో వ్యవహారం చేశారు. దీనిపై చర్చ జరిగింది. నేను కూడా మాట్లాడారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే.. తెలంగాణకు నీళ్లు రావాలి. ఇప్పుడు ఎత్తిపోతలు తప్ప తెలంగాణ గత్యంతరం లేని తేలింది. తెలంగాణ భౌగోళిక పరిస్థితి ఉంటది. తెలంగాణ రెండు బేసినట్లుగా ఉంటది. గోదావరి, కృష్ణ ఒక వైపు. కందకుర్తి వద్ద గోదావరి ప్రారంభమవుతుంది. అక్కడ 323 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మేడిగడ్డ మ్యారేజ్ 85 మీటర్ల లెవల్లో ఉంటుంది. సమ్మక్క బరాజ్ 70 మీటర్ల లెవల్లో ఉంటుంది. సీతమ్మ సాగర్ ఏదైతో కడుతునమ్మో ఖమ్మం కోసం అక్కడ 47 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గోదావరి అప్పర్ గోదావరి.. మిడిల్ గోదావరి.. లోయర్ గోదావరి అని ఉంటుంది. గోదావరి మహారాష్ట్రలో మొదలవుతుంది. గోదావరి క్యాచ్మెంట్ 3,00,812 చదరపు కిలోమీటర్ల ఉంటుంది. దాదాపు 7.70కోట్ల ఎకరాలకు సమానం. అంతప్రాంతంలో కురిసే వర్షం ఎక్కడి నుంచి వస్తుంది. ఏ నదికైనా ఉప నదుల నుంచి వస్తుంది. మహారాష్ట్రలో వెస్ట్రన్ ఘాట్స్లో కురిసే వర్షం మూల, ప్రవర, పూర్ణ తదితర ఉప నదుల నుంచి గోదావరిలోకి వస్తుంది’ అని తెలిపారు.
‘బచావత్ 1974లో ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పుడు సబ్ డివిజన్ వైజ్గా తీసుకొని పంపిణీ చేశారు. ఈ సబ్ డివిజన్ వరకు మహారాష్ట్రకు, ఈ సబ్ డివిజన్ వరకు మహారాష్ట్రకు, ఈ సబ్ డివిజన్ వరకు మంజీర ఉంటుంది కాబట్టి కర్ణాటక, ఇది ఒరిస్సాకు అని చెప్పి.. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. రాష్ట్రం తర్వాత సముద్రం ఉంటుంది కాబట్టి.. మిగతా నీళ్లన్నీ ఆంధ్రప్రదేశ్కేనని చెప్పారు. దాన్ని మనవాళ్లు ఏదో లెక్కగట్టారు. దాదాపు 1480-1500 టీఎంసీలు ఉంటదని లెక్కగట్టారు. ఇది కాకిలెక్క. ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది. గోదావరి ప్రధాన ఉపనదులు మూడు. ఒకటి ప్రాణహిత. ఇది పెద్ద ఉపనది. తర్వాత ఇద్రావతి, చివరన పాపికొండల తర్వాత శబరి ఉపనది వస్తుంది. ఇందులో యావరేజ్ లెక్కలు తీస్తే.. 1700 టీఎంసీల నీళ్లు తీసుకువచ్చేది ప్రాణహిత. 650 టీఎంసీల నీరును తెచ్చేది ఇద్రావతి. 400-600 టీఎంసీలు తెస్తుంది. శబరి ఏపీ పోలవరానికి ఉపయోగపడుతుంది. తెలంగాణకు ఉన్న అవకాశం ప్రాణహిత.. లేకపోతే ఇంద్రావతి. ఇద్రావతిలో ఒకేసారి వరద వస్తుంది.. తగ్గిపోతుంది. ఈ నదిలో ఎక్కువ తక్కువగా వస్తుంది. ఏకైక జీవనది ప్రాణనది. గోదావరి నది కంటే.. జీవనది ప్రాణహిత. ప్రాణహిత లేకపోతే గోదావరి లేదు. ఎక్కడి నుంచి నీళ్లు తీసుకోవాలంటే ప్రాణహిత నుంచి తీసుకోవాలి’ అని తెలిపారు.
‘సమైక్య పాలకులు కేటాయించిన 900 టీఎంసీలు.. తెలంగాణ వాడుకోవాలంటే ప్రాణహిత ఒక్కటే. సెంట్రల్ వాటర్ కమిషన్కు చెందిన వ్యాప్కోస్ సర్వే చేసింది. వాళ్లు చేసిన నిర్ధారణే. గోదావరి బేసిన్లో హైయ్యెస్ట్ భూమి లెవెల్ ఉండేది 680 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొండపోచమ్మ సాగర్ వద్ద 15 టీఎంసీల ప్రాజెక్టు కట్టాం. 85 నుంచి 680 మీటర్ల ఎత్తుకు గోదావరి నీళ్లు రావాలి. కృష్ణ ప్రాజెక్టులో శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవాలి. కృష్ణ హయ్యెస్ట్ పాయింట్ లక్ష్మీదేవిపల్లి గ్రామం. ఇది 670 మీటర్ల ఎత్తులో ఉంటుంది. తెలంగాణ ఉత్తరం వాలుగా, దక్షిణం వాలుగా ఉంటుంది. మళ్లీ తూర్పు వాలుగా ఉంటుంది. విచిత్రమైన విషయం ఏంటంటే.. 11వ శతాబ్దంలో తెలంగాణ కేంద్రంగా పరిపాలించిన కాకతీయరాజులు పుణ్యాత్ములు. వారికి ఎక్కడి నుంచి వచ్చిందో టెక్నాలజీ.. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ విజ్ఞానం తెలియదు గానీ.. దీన్ని గమనించి 75వేల చెరువులు నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన కూలీ కుతుబ్షాలు, నిజాంలు ఆ పరంపరను కొనసాగించారు. అసలు తెలంగాణ జీవిత ఆధారమే చెరువులు’ అని వివరించారు.
‘సమైక్య రాష్ట్రం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత దాన్ని మైనర్ ఇరిగేషన్ అని పేరుపెట్టి ధ్వంసం చేశారు. నేరపూరిత నిర్లక్ష్యం. నేను కూడా ఎమ్మెల్యేగా చాలారోజులు పని చేశాను. ఒక్కో సంవత్సరం ఒక్కరూపాయి కూడా బడ్జెట్ దొరికేది కాదు. అవన్నీ మురికి తుమ్మచెట్లకు నిలయమై.. తూములు కూలిపోయి భయంకరమైన పరిస్థితి. అసలు ఇది చెరువు అనే స్పృహనే ప్రజలే కోల్పోయారు. రసాయనిక ఎరువుల వినియోగం వచ్చాక చెరువుల్లో మట్టి తీయడం మరిచిపోయారు. చెరువులు నిండేది లేదు.. మట్టి వచ్చేది లేదు.. ఫీడర్ ఛానెల్స్ అన్ని పోయాయి. అస్తవ్యస్తంగా తయారయ్యాయి. తెలంగాణ వచ్చే సరికి భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. భయంకరమైన లోతులో నీళ్లు వెళ్లాయి. 700-800 ఫీట్లు బోర్లు వేస్తేనే నీళ్లు వచ్చే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తెలంగాణకు నీళ్లు కావాలి. సమైక్య పాలకులు.. వైఎస్ రాజశేఖర్ కావొచ్చు.. పాలమూరు సర్వే కోసం జీవో ఇచ్చిన కిరణ్కుమార్రెడ్డి ఎత్తిపోతలకే ఇచ్చారు. ప్రాణహిత-చేవెళ్ల పేరుపై, కంతనపల్లి, దేవాదుల పేరుమీద ఇచ్చారు. కృష్ణలో కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, పాలమూరు ఎత్తిపోతల మీద ఇచ్చారు. విషయం ఏంటంటే.. నీళ్లు ఎత్తుకు తీసుకెళ్లాలి. ఒక లెవల్కు వస్తే కొన్ని నీళ్లు వస్తయ్.. మరో లెవల్కు వస్తే కొన్ని లక్షల ఎకరాలకు నీరు వస్తుంది’ అన్నారు.