హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : ఎంపీ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో రోజురోజుకూ ఆసక్తి సన్నగిల్లుతూ.. ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయింది.
దీంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేడు రాష్ర్టానికి విచ్చేసి ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, పార్టీ అభ్యర్థులు, ఇప్పటికే నియమితులైన ఇన్చార్జిల పనితీరు, కొనసాగుతున్న ప్రచార సరళిని సమీక్షించనున్నట్టు సమాచారం.