హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన మహిళా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్బీవో)కు అరుదైన గౌరవం దక్కింది. విధుల్లో నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు కేంద్ర ప్రభుత్వం పురస్కారం ప్రదానం చేసింది.
నాగార్జునసాగర్ డివిజన్లోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో విధులు నిర్వర్తిస్తున్న కవితకు జాతీయస్థాయి అవార్డు అందించింది. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్లోని జిమ్కార్బెట్ టైగర్ రిజర్వ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అశ్వినికుమార్ చౌబే నుంచి కవిత ఈ అవార్డు అందుకున్నారు.