నిజామాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నివాసంలో సంబురాలు మిన్నంటాయి. ఎమ్మెల్యే మంత్రి ప్రశాంత్ రెడ్డికి మిఠాయిలు తినిపించి, పటాకులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు.
ఈ స్థానానికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. శ్రీనివాస్ అఫిడవిట్లో తప్పులు ఉన్నాయని ఈ క్రమంలోనే నామినేషన్ను తిరస్కరించినట్లు అఅధికారులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విఠల్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాం కిషన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Nizamabad | స్వతంత్ర అభ్యర్థిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు
ఆ కొలతలు ఉన్న అమ్మాయి కావాలి.. మ్యాట్రిమోనిలో ప్రకటన
Kumram Bhim Asifabad | కర్జెల్లి చోరీ కేసులో నిందితుడి అరెస్ట్