కుమ్రం భీ౦ అసీఫాబాద్ : జిల్లాలోని చింతల మానేపల్లి మండలం కర్జెల్లి గ్రామంలోని చౌదరి రాజక్క ఇంట్లో ఈనెల 20 జరిగిన చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కౌటాల పోలీస్ స్టేషన్లో కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్ మీడియాకు విరాలను వెల్లడించారు.
కర్జెల్లి గ్రామానికి చెందిన రాజక్క దంపతులు వ్యవసాయ పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో.. అదే గ్రామానికి చెందిన తెలుగే సంపత్ కుమార్ చోరీకి పాల్పడ్డాడు.
ఇంట్లో డబ్బులు దాచి ఉంచిన పెట్టెను ఎత్తుకెళ్లి అందులోని రూ. 50 వేలు, 64 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి విచారించగా దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు వివరించారు. నిందితుని వద్ద నుంచి 64 గ్రాముల బంగారం, రూ.50 వేల నగదు రికవరీ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.