నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ పైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నామినేషన్ దాఖలుకు ప్రపోజల్ జాబితాలో జత చేసిన స్థానిక సంస్థల ఓటర్ల సంతకాలను ఫోర్జరీ చేసినట్టుగా నిన్న రాత్రి నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
కాగా, బుధవారం సంబంధిత వ్యక్తులు కలెక్టర్ నారాయణరెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నందిపేట ఎంపీటీసీ నవనీత, నిజామాబాద్ నగరానికి చెందిన 31వ డివిజన్ కార్పొరేటర్ గజియా సుల్తానా ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.
స్వతంత్ర అభ్యర్థిపై వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల నియమావళి ప్రకారం పరిశీలన చేస్తున్నారు. ఈసీ ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం వరకు ఫిర్యాదులపై తుది నిర్ణయం వెల్లడి కానుంది.