హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషిచేస్తానని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి తెలిపారు. బుధవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి ఈహెచ్ఎస్ను అమలు చేయనుండటం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, టీటీయూ అధ్యక్షుడు మణిపాల్రెడ్డి, టీఎస్టీయూ అధ్యక్షుడు ఎండీ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
నేడు చెన్నకేశవరెడ్డి నామినేషన్ దాఖలు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్ తెలిపారు. చెన్నకేశవరెడ్డికి 25 ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు.