జహీరాబాద్, నవంబర్ 14: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని బీదర్ జిల్లా రాజగిరి గ్రామనికి చెందిన నర్సింహ విమర్శించారు. మంగళవారం మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామంలో జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కర్ణాటకలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ వ్యవసాయనికి కరెంట్ సక్రమంగా సరఫరా చేయడం లేదని పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కలిపిస్తామని హామీనిచ్చి సరిగ్గా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని, కర్ణాటకలో ఇలాంటి పథకాలు లేవని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు నర్సింహను అభినందించారు.