విద్యానగర్, మే 1: కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన వైద్యులు దంత శస్త్ర చికిత్సల్లో రికార్డును నెలకొల్పారు. డెంటిస్ట్ డాక్టర్ వాడె రవిప్రవీణ్రెడ్డి ఒకే నెలలో 573 సర్జరీలు చేశారు.
దేశ చరిత్రలో ప్రభుత్వ దవాఖాన దంత విభాగంలో ఒక నెలలో ఒకే డాక్టర్ 500కు పైగా సర్జరీలు చేయడం ఇదే ప్రథమం. డాక్టర్ రవి ప్రవీణ్రెడ్డి చేసిన సర్జరీల్లో 461 మైనర్, 112 మేజర్ సర్జరీ కేసులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద ఇంత పెద్ద మొత్తంలో సర్జరీ చేయడం ఇదే తొలిసారి.