రఘునాథపల్లి, జనవరి 31: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో కంటివెలుగు శిబిరాన్ని నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్యూఏఎస్) బృందం సభ్యులు మంగళవారం సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రోజుకు ఎంతమందికి పరీక్షలు చేసి కంటి అద్దాలు ఇస్తున్నారు? మెరుగైన వైద్యం కోసం ఎక్కడికి రెఫర్ చేస్తున్నారు? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంధత్వరహిత సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టడం గొప్పవిషయమని వారు కొనియాడారు.