Kanti Velugu | రాష్ట్రవ్యాప్తంగా రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్లోని అమీర్పేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి హరీశ్ రావు కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించగా, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆరంభిస్తున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో కంటివెలుగు కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్యరంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. వృద్ధులు, మహిళలు పెద్దసంఖ్యలో శిబిరాల వద్దకు చేరుకుని పరీక్షలు చేయించుకుంటున్నారు.
కరీంనగర్ పట్టణంలోని ఇందిరానగర్లో మంత్రి గంగుల కమలాకర్.. కంటివెలుగు కార్యక్రామన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. పలువురికి అద్దాలు పంపిణీ చేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటిఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.
ఇక నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి పరీక్షల శిబిరాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. స్వయంగా ఆయన పరీక్షలు చేయించుకున్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. పలువురి అద్దాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి..
రాష్ట్రవ్యాప్తంగా..