ఆదిలాబాద్ : దివంగత డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ మృతి టీఆర్ఎస్కు, దళిత సమాజానికి తీరని లోటు అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏడీసీసీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. కాంబ్లే నాందేవ్ చిత్రపటానికి మంత్రి, పలువురు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంబ్లే నాందేవ్ తో తమకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఎజెన్సీ ఏరియాలో దళితుల సంక్షేమం కోసం కృషి చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన సేవలను కొనియాడారు. కాంబ్లే కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ పై తాను తాగి..
Suryakumar Yadav: ఇంగ్లండ్ బయలుదేరిన సూర్యకుమార్ యాదవ్
రామప్పను సందర్శించిన మంత్రులు, పురావస్తు శాఖ అధికారులు
జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత
మహబూబాబాద్ జిల్లాలో 120 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత