హుజురాబాద్ :దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కమలాపూర్ దళితులు పెద్దఎత్తున పాదయాత్రగా బయలుదేరారు. కమలాపూర్ లో అంబేద్కర్ విగ్రహం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ జరిగే శాలపల్లికి పాదయాత్రగా బయల్దేరారు. ఈ పాదయాత్రను మండల టీఎస్ఆర్ ఇంచార్జ్ డాక్టర్ పెరియాల రవీందర్ రావు జెండా ఊపి ప్రారంభించారు.