సూర్యాపేట టౌన్, జనవరి 20: పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కట్నంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నేరుగా తమ చెంతకే చేరడంతో నారీలోకం మురిసిపోతున్నది. గురువారం మంత్రి జగదీశ్రెడ్డి స్వయంగా సూర్యాపేటలోని లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కులు అందజేశారు. చెక్కులు ఇచ్చేందుకు వచ్చిన మంత్రికి మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు.