Kaloji Award | హైదరాబాద్ : హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజా కవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు 109వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డును కవి జయరాజ్కు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్తో కలిసి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ చారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు జూలూరి గౌరీశంకర్, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ అయాచితం శ్రీధర్, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ దీపికా రెడ్డి, భాష సాంస్కృతిక అధ్యక్షులు మంత్రి శ్రీదేవి, పీసీసీబీ సభ్యులు సుమిత్ర, భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రముఖ సాహితీ వేత్తలు, కవులు, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.