BRS Working President KTR | కాళేశ్వరం ప్రాజక్టుపై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా దాని ప్రయోజనాలు మాత్రం ప్రజలముందు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్.. ప్రస్తుత వేసవిలో హైదరాబాద్ నగరవాసులకు నీటి ఎద్దడి లేకుండా ఆదుకోనున్నదని సోమవారం `ఎక్స్ (మాజీ ట్విట్టర్)` వేదికగా ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ నగర వాసుల దాహర్తిని తీర్చేందుకు మల్లన్నసాగర్ ద్వారా 100ఎంఎల్డీల నీటిని ఉపయోగించనున్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తను కేటీఆర్ ట్యాగ్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజక్టు అయిన కాళేశ్వరంపై అసత్య ప్రచారం చేయడం శోచనీయమని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.